సూపర్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ వ్యాప్తంగా కీర్తిప్రతిష్ఠలు అందుకున్న టాలీవుడ్ నటి అనుష్క. అయితే తన కెరియల్‌లో ఎన్నో మధురమైన మైళ్లురాళ్లు ఉన్నాయి. ఆ మైళ్లురాళ్లలో ఒక్క చిత్రం భాగమతి. ఈ సినిమాతో అనుష్క పేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. 

 

 

ఈ సినిమాలో ఎవడు పడితే వాడు రావడానికి ఇదేమైనా పశువుల కొట్టమా? భాగమతి అడ్డా... లెక్క తేలాలి. ఒక్కడినీ పోనివ్వను' అంటూ అనుష్క చెప్పే డైలాగులు, కోపంతో ఊగిపోతూ ఆమె పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. ఇప్పటి వరకు అనుష్క కెరీర్లో పెర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకోదగ్గ చిత్రాలు అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు. అయితే ‘భాగమతి' ట్రైలర్ చూస్తే వాటన్నింటినీ మించి పోయేలా ఉంటుందని స్పష్టమవుతోంది.

 

 

ఈ చిత్రంలో అనుష్క ఒక పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ చంచలగా, మరో పాత్రలో ‘భాగమతి'గా కనిపించబోతోందని తెలుస్తోంది. కొందరు స్వార్థ పరులు ఐఏఎస్ ఆఫీసర్ చంచలను అక్రమ కేసులో ఇరికించి జైలు పాలు చేస్తారని, ఆ తర్వాత ఆమెను ఓ పాడుపడ్డ పాతకాలం నాటి ప్యాలెస్‌కు తరలిస్తారని, అక్కడే భాగమతి ఆత్మ చంచలను ఆవహిస్తుందని.... ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.

 

 

అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సస్పెన్స్ డ్రామాలో ఉన్నిముకుందన్, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీళ్లేకాకుండా ఆశా శరత్, ప్రభాస్ శ్రీను, మురళీ శర్మ, విద్యుల్లేఖ రామన్, ధనరాజ్ లాంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

 

దీంతో అనుష్క అప్ కమింగ్ మూవీ ‘భాగమతి’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అరుంధతి, రుద్రమదేవి లాంటి చిత్రాలతో మార్కెట్ రేటు పెంచుకున్న అనుష్క తాజా చిత్రం ‘భాగమతి’ తమిళ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. స్టూడియో గ్రీన్ సంస్థ 15 కోట్లకు భాగమతి తమిళ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: