ఎనర్జిటిక్ స్టార్ రామ్ మొదటి చిత్రమైన దేవదాస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఇలియానా, ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియానా.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. ఇలియానా బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

IHG

 

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించినప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఆమెకి కమ్ బ్యాక్ సినిమాగా ఉపయోగ పడలేదు. అయితే తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్న ఇలియానాని నితిన్ తో సినిమా చేస్తున్న దర్శకుడు సంప్రదించారట. భీష్మ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్, ఆ తర్వాతి చిత్రంగా బాలీవుడ్ చిత్రమైన అంధాధున్  సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

 

 

బాలీవుడ్ లో ఆయుష్మా ఖురానా పోషించిన పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన టబు రోల్ ని తెలుగులో ఎవరు చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ పాత్ర కోసం చాలా మందిని అడిగారు. టబు, రమ్యక్రిష్ణ, అనసూయ లతో  పాటు ఇలియానాని కూడా అడిగారట. కానీ వీరెవరూ ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకోలేదట. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇలియానా ఇందులో ఒప్పుకోకపోవడానికి కారణం,  ఆమె తెలుగులో మళ్ళీ హీరోయిన్ గా నటించాలని అనుకోవడమే అని అంటున్నారు.

 

 


మరి ఆమెకి మళ్ళీ తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు వస్తాయోమో చూడాలి. అయితే అంధాధున్ చిత్రంలో కీలకమైన ఆ పాత్రలో నటించడానికి బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఒప్పుకుందని సమాచారం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: