జనగణమన.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్.. దేశంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ పవర్ ఫుల్ డైలాగులతో అందరిని ఆలోచింపచేసేలా సాగే కథ ఇది. ఇటీవలే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు పూరి. ప్రస్తుతం ఈకథ కు హీరో ను వెతుకుతున్నాడు. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఈసినిమా చేయాలని  పూరి కోరిక. గతంలో ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కానీ అప్పట్లో పూరి వరస పరాజయాల్లో ఉండడం తో మహేష్ నుండి రెస్పాన్స్ రాలేదు అయితే ఇటీవల.. పూరి  ఎప్పుడు వచ్చి కథ చెపుతాడా అని వెయిట్ చేస్తున్నానని మహేష్ అన్నాడు. సో జనగణమనలో మహేష్ నటించే ఛాన్స్ కూడా లేకపోలేదు.
 
ఇక ఈసినిమా గురించి తాజాగా పూరి స్పందించాడు. జనగణమన నా డ్రీం ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది ,పాన్ ఇండియా లెవెల్లో ఈసినిమా తెరకెక్కనుందని పూరి అన్నాడు. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి కం బ్యాక్ అయిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ను పూర్తి చేసిన తరువాత పూరి, జనగణమన ను స్టార్ట్ చేయనున్నాడు.
 
ఇక ఫైటర్ విషయానికి వస్తే ఇటీవలే ముంబై లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకోగా కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆగస్టు లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తెలుగు తోపాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈచిత్రంలో స్టూడెంట్ అఫ్ ది ఇయర్ ఫేమ్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి ఛార్మి ,పూరి నిర్మిస్తున్నారు. ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: