ప్రముఖ యాంకర్ నటి అనసూయ  భరద్వాజ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు  బుల్లితెరపై మరోవైపు వెండితెరపై తన హవా నడిపిస్తుంది అనసూయ. తనదైన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఎక్కడా తన జోరు మాత్రం తగ్గించలేదు. వెండితెరపై వరుస  అవకాశాలను అందుకుంటూనే బుల్లితెరపై కూడా యాంకర్గా ఇరగదీసింది. ఇక అనసూయ భరద్వాజ్ ఎప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తన సినిమాలు షో లకు సంబంధించిన అప్డేట్స్ ని  పోస్ట్ చేయడంతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ కూడా ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

 


 తాజాగా అనసూయ భరద్వాజ్ కొన్ని  జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఇటీవలే అనసూయ భరద్వాజ్ తన తల్లి అనురాధ తో కలిసి వారి సొంతూరైన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి వెళ్లారు. ఇక అక్కడికి వెళ్ళినా అనసూయ భరద్వాజ్ చేనేత కార్మికులందరికీ పరామర్శించారు. అంతేకాకుండా చేనేత కార్మికులు తయారుచేసిన స్టాక్  మొత్తం లాక్ డౌన్ కారణంగా పేరుకుపోయిందని... చేనేత కార్మికులు అందరికి అండగా నిలవాలి అంటూ తన అభిమానులను స్నేహితులకు కోరారు అనసూయ భరద్వాజ్

 

 అంతేకాకుండా తన సొంతూరు లోని పలువురు చేనేత కార్మికులకు పేదలకు నిత్యావసరాలను కూడా పంపిణీ చేశారు. అయితే తాజాగా తన సొంతూరు లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదిక అభిమానులతో పంచుకున్నారు. గ్రామంలోని పలు అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఫోటోలు దిగిన అనసూయ భరద్వాజ్... చేనేత దుస్తులు ధరించి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చేనేతలు  అందరూ మన ఆస్తులు అంటూ తెలిపిన  అనసూయ భరద్వాజ్ వారికి తోడుగా ఉంటానని తెలిపారు. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: