జబర్దస్త్ కామెడీ షో లో సుధీర్ మరియు రష్మి కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ జంటపై అనేక పుకార్లు షికార్లు చేయటంతో జబర్దస్త్ యాజమాన్యం ఈ ఇద్దరి వల్ల చాలా లాభాలు అందుకోవటం జరిగిందని షో కి అదనపు బెనిఫిట్ రష్మీ మరియు సుధీర్ ఎపిసోడ్ బాగా కలిసొచ్చిందని చాలామంది అంటారు. ఒక్క జబర్దస్త్ లోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేయటంతో ఆ కార్యక్రమాలకు కూడా బాగా వీరిద్దరి వల్ల ప్రేక్షకాదరణ లభించింది. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు, ప్రేమించుకున్న ట్లు అప్పట్లో వీరిద్దరి గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

 

ఇటువంటి సమయంలో ఇటీవల లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లతో పాటు అన్ని షోలు సీరియల్స్ షూటింగ్ లు కూడా ఆగిపోవడంతో… ఇంటి దగ్గరే ఉన్న రష్మి… తన గురించి మరియు సుధీర్ గురించి అనేక విషయాలు ఇటీవల తెలిపింది. మేమిద్దరం కెమెరా ముందు మాత్రమే రెచ్చిపోతోం ఆడియెన్స్ ని అలరిస్తాం. తరువాత ఎవరి పని వారు చూసుకుంటామని, సుధీర్ తో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని తెలిపింది. "నేను, సుధీర్ కలిసి చేసే పనులు.. మా కెమిస్ట్రీ జనాల్లోకి బాగా వెళ్లింది.

 

ఇది పాజిటివ్ సైన్. మేం మంచి నటులమని ప్రూవ్ అయింది. అయినప్పటికీ జనాలు మా ఇద్దరిపై ఏవేవో అంచనాలు పెట్టుకున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒకటే. ఇదంతా షో. మా పని మేం చేశామంతే, జనాలకు అది ఎక్కేసిందంటే గర్వంగా ఉంది." అక్కడ వారికే మా బంధమని, ఈ లాక్ డౌన్ టైమ్ లో కనీసం ఒక్కసారి కూడా తనతో ఫోన్లో మాట్లాడటం జరగలేదని, అసలు అతనితో మాట్లాడాలని అనిపించలేదు అని తెలిపింది. లాక్ డౌన్ టైమ్ లో ఇద్దరిపై ఎక్కువగా రకరకాల వార్తలు రావడంతో వివాదాలకు పులిస్టాప్ పెడుతూ రష్మి క్లారిటీ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: