వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో నాగచైతన్య తన భార్య  సమంత ని హీరోయిన్ గా పెట్టి 'మజిలీ' సినిమా చేసి అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత వెంకటేష్ తో కలిసి 'వెంకీ మామ' సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర పెద్దగా లేక పోయినా సినిమా పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఆ తర్వాత టాలీవుడ్ క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా ఓకే చేయడం జరిగింది. హీరోయిన్ సాయి పల్లవి తో నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. సరిగ్గా సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్ కార్యక్రమాలు చెయ్యాలి అని అనుకుంటున్న సమయంలో కొద్దిపాటి సినిమాలో చేంజ్ చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్.

 

లాక్ డౌన్ టైమ్ లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంట. దీంతో ఆ కొద్దిపాటి సన్నివేశాల కోసం సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని భావించిన సమయంలో సినిమాకి సంబంధించిన టీం ఎవరు కూడా అందుబాటులోకి రావటం లేదట. దీంతో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన కానీ చిన్న చేంజ్ వల్ల తన సినిమా ఆగిపోవటంతో నాగచైతన్య చాలా డల్ గా ఉన్నాడట.

 

షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన సినిమా కి ఈ విధంగా అడ్డంకుల రావటం సినిమా థియేటర్ లు ఓపెన్ అవ్వకపోవటం తో చాలా నిరుత్సాహం చెందుతున్నాడు అని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిన్నపాటి చేంజ్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేసి… పరిస్థితి అంత  సద్దుమణిగితే, దసరాకి లేకపోతే వచ్చే ఏడాదికి సినిమా రిలీజ్ చేయాలని, సినిమా యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: