సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ 27వ సినిమాగా రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక చాలావరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మొదటగా యువత సినిమాతో దర్శకుడిగా మారిన పరశురామ్, తనకు ఒక్కడు సినిమా చూసిన తరువాత సినిమా ఇండస్ట్రీ కి రావాలని అనిపించిందని, అలానే ముందుగా పూరి జగన్నాథ్ గారి వద్దకు వెళ్లి, అక్కడి నుండి మరికొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసినట్లు చెప్పారు. 

IHG

తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ తో తాను త్వరలో సినిమా తీయబోతుండడం నిజంగా తన అదృష్టం అని, తప్పకుండా సినిమాని మంచి సక్సెస్ చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా పరశురామ్ మాట్లాడుతూ చెప్పారు. ఇకపోతే చాలా రోజుల నుండి ఈ సినిమా లో నటించబోయే హీరోయిన్ విషయమై పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ముందుగా కియారా అద్వానీ, శ్రద్ధ కపూర్ వంటి నాయికల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆ తరువాత కీర్తి సురేష్, సాయి మంజ్రేకర్ వంటి వారి పేర్లు కూడా గట్టిగా వినిపించడం జరిగింది. అయితే ఇటీవల ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ, తాను మహేష్ బాబు సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. అయితే అది సర్కారు వారి పాటలోనా లేక మరొక సినిమాలోనా అనేది స్పష్టం చేయలేదు. .

 

మరోవైపు దబాంగ్ 3 హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా ఒక వీడియో ఇంటర్వ్యూ లో భాగంగా మీరు టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారా అని అడుగగా, అది తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో కీర్తి సురేష్ తో కలిసి నటిస్తే తెరపై చూడాలనుకుంటున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నమ్రత శిరోద్కర్ కు సాయి మంజ్రేకర్ తండ్రి మహేష్ మంజ్రేకర్ ఫ్యామిలీ తో మంచి అనుబంధం ఉండడంతో ఆమెనే సినిమాలో ఫైనల్ చేసే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు. అయితే మొత్తంగా ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరు సర్కారు వారి పాటలో నటిస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: