కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే అన్న సినిమాలో నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా లతో పాటు నయనతార, కీర్తి సురేశ్  నటిస్తున్నారు. ఇదే సినిమాని అన్నయ్య పేరుతో తెలుగులోను డబ్బింగ్ చేయబోతున్నారు.

 

ఇక ఈ సినిమాని 2021 సంక్రాంతి టార్గెట్ గా మేకింగ్ ప్లాన్ చేసినప్పటికి లాక్ డౌన్ తో సమ్మర్ కి వెళ్ళిందని తాజా సమాచారం. ఇక గత సంక్రాంతికి వచ్చిన దర్బార్ భారీ ఫ్లాప్ గా మిగిలింది. అందుకే ఈ సంక్రాంతికి ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటే అది కాస్త వెనక్కి వెళ్ళింది.  

 

అయితే తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ అన్నాతే సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న ప్రాజెక్ట్ కి రజనీకాంత్ ఒకే చెప్పారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో పేట భారీ అంచనాల మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిడిజాస్టర్ గా నిలిచింది.  

 

దాంతో రజనీకాంత్ కి కార్తీక్ సుబ్బరాజు ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న కసితో అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్దం చేసినట్టు తెలుస్తుంది. ఇక గత కొంతకాలంగా రజనీకాంత్ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలుస్తున్నాయి. అయితే అన్నాత్తే తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇక సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారట.

 

ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంటే పూరి జగన్నాధ్ తన ఫేవరేట్ తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో జనగణమన తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఒక్క సినిమా చేశాక మీ ఇష్టం అంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం లో ఉన్నాడట. మరి తలైవర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: