ప్రస్తుతం తెలుగులో టాప్ లో ఉన్న హీరోయిన్లు ఎవరని అంటే, ముందుగా గుర్తొచ్చే పేర్లలో రష్మిక మందన్న ఒకరు కాగా, పూజా హెగ్డే మరొకరు. వీరిద్దరూ నంబర్ వన్ స్థానం కోసం బాగా పోటీ పడుతున్నారు. వరుస బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం వీరి చేతిలో అన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయి. పూజా హెగ్డే  ప్రభాస్ 20వ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది.

 

అటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇక రష్మిక మందన్న సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని, ప్రస్తుతం బన్నీ సరసన పాన్ ఇండియా చిత్రం పుష్పలో నటిస్తుంది. అయితే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న రష్మికాని నాని సినిమాలో నటింపజేయాలని భావించారట. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యయాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందనున్న భారీ బడ్జెట్ చిత్రంలో రష్మికాని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.

IHG's next titled 'Shyam Singha Roy' | The <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> Minute

కోల్ కతా నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకి శ్యామ్ సింగరాయ్ అనే విభిన్నమైన టైటిల్ ని పెట్టారు. అయితే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లు కావాల్సి ఉందట. మొదటి హీరోయిన్ గా ఫిదా ఫేమ్ సాయిపల్లవిని ఎంచుకున్నట్లు సమాచారం. రెండవ హీరోయిన్ గా రష్మిక పేరు బయటకి వచ్చింది. అయితే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్న రష్మిక సెకండ్ హీరోయిన్ గా చేస్తుందా అనేది సందేహం..

IHG

అయితే ఈ ఆఫర్ ని రష్మిక తిరస్కరించిందని అంటున్నారు. ఈ ప్లేస్ లో రీతూ వర్మ, నిధి అగర్వాల్ ల పేర్లని పరిశీలిస్తున్నారట. అసలు  స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని ఎలా అనుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరో పక్క స్టార్ హీరోయిన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారంటే, ఆ పాత్రకి మంచి స్కోప్ ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: