నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తి  చేసుకున్న ఈచిత్రం జులై లో మిగితా షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ఇక ఈ చిత్రానికిమ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఖరారు చేశారు. సురేష్ బొబ్బిలి ఈసినిమా కు సంగీతం అందిస్తున్నాడు. నిన్నటి నుండే మ్యూజిక్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.
 
రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సాయి పల్లవి, నక్సలైట్ గా కనిపించనుంది వీరితోపాటు మలయాళ నటి నందితా దాస్, మానవ హక్కుల నేతగా అలాగే ప్రియమణి , కామ్రేడ్ భారతక్క గా నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుండి  సాయి పల్లవి , ప్రియమణి ఫస్ట్ లుక్ లు విడుదలకాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సురేష్ బాబు ప్రొడక్షన్స్ ,ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ల పై  సురేష్ బాబు ,చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. 
 
మరోవైపు సాయి పల్లవి, తెలుగులో ఈ సినిమా తో  పాటు లవ్ స్టోరి లో కూడా నటిస్తుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నఈచిత్రంలో యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక రానా ప్రస్తుతం మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అందులో గుణశేఖర్, హిరణ్యకశ్యప  ఒకటి కాగా తేజతో కూడా సినిమా చేయనున్నాడు. కాగా రానా నటించిన అరణ్య విడుదలకావల్సివుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: