భీష్మ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్, వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్నాడు. గత కొన్ని రోజులుగా హిట్ కోసం ఎదురుచూసిన నితిన్ కి భీష్మ రూపంలో సాలిడ్ హిట్ పడడంతో ఫుల్ జోష్ మీదున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ఇప్పటి వరకూ కొంతభాగం షూట్ చేసుకున్న చిత్రం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే..  ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 

IHG

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, నితిన్ తో రొమాన్స్ చేయబోతున్న ఈ చిత్రం నుండి మోషన్ పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ లో నితిన్, కీర్తిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అర్థం అవుతుంది. దాంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం షూటింగ్స్ కి అనుమతులు లభించిన నేపథ్యంలో ఆగస్టు నుండి చిత్రీకరణని ప్రారంభించాలని చూస్తున్నారు.

 


అయితే నితిన్, కీరిసురేష్ మరో మారు తెర మీద రొమాన్స్ చేయబోతున్నారట. ఛల్ మోహన రంగ సినిమాకి దర్శకత్వం వహించిన క్రిష్ణ చైతన్య నితిన్ తో పవర్ పేట అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరయితే బాగుంటుందని చూస్తున్నారట. అందులో భాగంగా కీర్తి సురేష్ ని ఎంచుకున్నట్లు సమాచారం అందుతోంది. రంగ్ దే సినిమాలోని రషెస్ చూసిన క్రిష్ణ చైతన్య ఈ విధంగా డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

 

క్రిష్ణ చైతన్య రాసుకున్న పాత్రకి కీర్తి అయితే సరిగ్గా సరిపోతుందట. అందుకని మరో మారు ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారట. మరి అధికారిఅక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి నితిన్ రంగ్ దే తో పాటు బాలీవుడ్ అంధాధున్ తెలుగు రీమేక్ లోనూ నటిస్తున్నాడు. అదీ గాక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమాని ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: