బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఇప్పటికీ మిస్టరీ వీడడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలని ప్యాషన్ తో  దృఢమైన సంకల్పం తో బుల్లితెర లో విజయం సాధించి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో డాన్స్ లతో బాలీవుడ్ ప్రేక్షకులందరినీ అలరించి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సుశాంత్ సింగ్ రాజ్పుత్. హీరోగా సుశాంత్ కెరియర్ మంచి సక్సెస్ రేటు తో దూసుకుపోయింది అనే చెప్పాలి. అంత మంచి క్రేజ్ ఉన్న హీరో సుశాంత్ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను షాక్కు గురి చేసింది. 

 


 అయితే డిప్రెషన్ వల్ల  ఆయన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని తేలినప్పటికీ.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న సినీ ప్రముఖులు కారణం అనే ఒక వాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా బాలీవుడ్లోని బడా బడా సినీ ప్రముఖులపై విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కరణ్ జోహార్ సహా మరికొంత మంది బాలీవుడ్ సినీ ప్రముఖులపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.. 

 

 అంతే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలను ఎంతో మంది నెటిజన్లు అన్ ఫాలో కూడా అవుతున్నారు. అయితే తాజాగా నేటివ్ రాష్ట్రం బీహార్లోని సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు ఆయన ఆత్మహత్య పట్ల కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడ సల్మాన్ ఖాన్ కరణ్ జోహార్ సహ మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖుల చిత్రాలను విడుదల కానివ్వం అంటూ పిలుపునిచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టారు. మరి వీరూ ఎన్ని రోజుల వరకు ఇలా ఉద్యమం కొనసాగిస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: