టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా రెండేళ్ల విరామం అనంతరం ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అవ్వగా, క్రిష్ సినిమా మాత్రం కొంత మేర పూర్తి అయినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్, ఆ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో, ఎలాగైనా రీఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించనున్నారు. 

IHG

ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో మహేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు టాక్. ఇకపోతే అటు పవర్ స్టార్, ఇటు సూపర్ స్టార్, ఈ ఇద్దరూ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి పోటీ పడే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు అని చెప్పకతప్పదు. అటు ఫ్యాన్ ఫాలోయింగ్ లోను, ఇటు క్రేజ్ లోను, అలానే భారీ మార్కెట్ రేంజ్ లోనూ ఈ ఇద్దరు బడా స్టార్స్ దాదాపుగా సమానంగా ఉంటారు. 

 

అయితే ఎప్పటినుండో ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలనే అటు పవన్ ఫ్యాన్స్, ఇటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఎందరో ప్రేక్షకులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి టాక్ తో సంబంధం లేకుండా తమ సినిమాలకు విపరీతమైన కలెక్షన్ ని సంపాదించగల ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే మాత్రం నిజంగా ఆ సినిమాకు కలెక్షన్స్ సునామీలా వచ్చి పడడంతోపాటు, ఆ సినిమా పెద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం అని చెప్పాలి. మరి ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించే సినిమా ఎప్పుడు వస్తుందో, ఈ కాంబోని ఏ దర్శకులు సెట్ చేస్తాడో తెలియాలంటే కొన్నాళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: