లాక్ డౌన్ టైమ్ లో హీరో హీరోయిన్లు ఎవరికివారు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేస్తూ రకరకాల పనులు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. మంది భార్యలకు సహాయం చేస్తూ మరికొంతమంది...అభిమానుల తో చిట్ చాట్ చేస్తూ అనేక విశేషాలు గురించి కెరీర్ ప్లానింగ్ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి తెలియ చెప్పడం జరిగింది. మరికొంత మంది హీరోలు మరియు హీరోయిన్లు లాక్ డౌన్ టైమ్ లో వెబ్ సిరీస్ పై దృష్టి సారించారు. తాజాగా వెబ్ సిరీస్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడట నాగ చైతన్య. సోషల్ మీడియా కి దూరంగా ఉండే నాగ చైతన్య తాజాగా ఇటీవల...సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అది చూసిన అక్కినేని అభిమానులు తెగ మురిసిపోయారు.

 

ఇప్పుడు ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. చెర్కునోబైల్ వెబ్ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నారు. కొంతమంది అద్భుతమైన నటన కనుబరిస్తే మరికొంతమంది రైటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఆకట్టుకున్నారు. అది స్ఫూర్తిదాయకంగా ఉందని అందరు చూడాలని  నాగ చైతన్య సూచించాడు. అద్భుత నటన రచన నిర్మాణ విలువలు బాగున్నాయి అని పేర్కొన్నాడు. మీరు ఇప్పటి వరకు చూడకుండా ఉంటే తప్పకుండా అసలు మిస్ కాకుండా ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలని మరి కొన్ని వెబ్ సిరీస్ సంబంధించి పోస్టర్ల ను పోస్ట్ చేశాడు.

 

దీంతో ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది తప్పకుండా చూస్తాం చైతు అంటూ రిప్లై ఇస్తున్నారు. కాగా నాగచైతన్య పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సమంత కూడా ప్రస్తుతం ఎక్కువగా వెబ్ సిరీస్ కంటెంట్ లపైనే దృష్టిసారించడం విశేషం.. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: