టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమాలు అంటే స్టార్ హీరోలు ఎగబడి మరీ డేట్లు ఇస్తారు. అలాంటి స్క్రిప్టులు రెడీ చేసి సినిమా హీరోల ను అద్భుతంగా తీర్చిదిద్దుతాడు పూరి జగన్నాథ్. బద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పూరిజగన్నాథ్ 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని 40 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులను తిరగరాశాడు. రవితేజ కి మంచి లైఫ్ ఇవ్వటంతో పాటు మహేష్ బాబుకి సూపర్ స్టార్ డాం తీసుకురావడంలో కీలక పాత్ర 'పోకిరి' సినిమాతో పోషించాడు పూరి అని చాలామంది అంటుంటారు. అతి తక్కువ టైమ్ లోనే సినిమాలు తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాలంటే పూరి జగన్నాథ్ కేరాఫ్ అడ్రస్ అని చాలామంది చెబుతుంటారు. చాలామంది దర్శకులు సంవత్సరాలపాటు సినిమాలు తీసి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు, కానీ పూరి జగన్నాథ్ నెలలోనే, రోజులలోనే సినిమాలు తీసి అవలీలగా సత్తా చాటుతారు అని చెబుతుంటారు.

 

అటువంటి పూరిజగన్నాథ్ 'టెంపర్' సినిమా తర్వాత సరైన హిట్ లేక చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవడంతో పాటు ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ టైములో ఇల్లు , ఆఫీస్ ని కూడా అమ్ముకుని గత ఏడాది 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా రాకముందు వరకు పూరి జగన్నాథ్ తో సినిమా అంటే చాలామంది స్టార్ హీరోలు ప్లాపుల్లో ఉండటంతో వెనక్కి వెళ్లిపోయిన వారు ఉన్నా పరిస్థితి నెలకొంది. కాగా మొత్తం చేతిలో ఉన్న ప్రాపర్టీ మొత్తం అమ్ముకుని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసి నిర్మించి రిలీజ్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్'  గత ఏడాది జూలై 18న రిలీజ్ అయ్యి అదిరిపోయే హిట్ అందుకుంది.

 

దెబ్బకి పూరి జగన్నాథ్ సినిమా విజయంతో మంచి కలెక్షన్లు రాబడుతోంది అని టాక్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం పూరి ఇస్ బ్యాక్ అంటూ మారుమోగిపోయింది. అటువంటి పూరిజగన్నాథ్... తాను తీసిన సినిమాల విషయంలో ఇప్పటివరకు హిట్ అయినా ఫ్లాప్ అయినా పెద్దగా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఏమీ ఇచ్చేవారు కాదు. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ని హీరోగా పెట్టి చేస్తున్న ‘ఫైటర్’ సినిమా తన కెరియర్ లోనే మర్చిపోలేని సినిమా అని ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఇరగదీస్తున్నడు సినిమాలో అతని పనితనం బాగా నచ్చింది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో అతని స్టైల్ నన్ను బాగా ఆకట్టుకుంది అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. తన కెరీర్లోనే మర్చిపోలేని సినిమాగా 'ఫైటర్' నిలిచిపోతుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: