అక్కినేని నాగేశ్వరరావు నాస్థికుడు ఆయన జీవిత కాలంలో ఎప్పుడు ఒక్క దేవాలయానికి కూడ వెళ్ళలేదు. అయితే నాగేశ్వరరావు భక్తిరసాన్ని ఆస్వాదిస్తూ అనేక సినిమాలలో నటించి మెప్పించాడు. ‘భక్తతుకారం’ ‘చక్రధారి’ లాంటి ఎన్నో సినిమాలలో దేవుడుని నిరంతరం ఆరాధించే పరమ భక్తుడుగా అక్కినేని నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి.


ఇక నాగార్జున కూడ అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ పెద్దగా జాతకాలు ముహూర్తాలు పూజలు హోమాలు వంటి మూఢనమ్మకాల జోలికి వెళ్ళకుండా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. అయితే ఎవరు ఊహించని విధంగా అక్కినేని అఖిల్ అయ్యప్ప మాల వేసుకుని ఈ లాక్ డౌన్ పిరియడ్ లో పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నాడు అన్నవిషయం చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


అంతేకాదు తన మిత్రులకు సన్నిహితులకు అయ్యప్ప మాల వేసుకోమని అలా వేసుకుంటే వచ్చే ప్రశాంతత గురించి అఖిల్ తనను కలుస్తున్న వారందరికీ చెపుతున్నట్లు టాక్. దీనితో చాల చిన్న వయసులో అఖిల్ లో పెరిగిపోయిన ఆధ్యాత్మిక చింతన ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అఖిల్ వరస పరాజయాలతో సతమతమవుతున్న పరిస్థితులలో ఎన్నో ఆశలు పెట్టుకుని నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ఎప్పుడు విడుదల అవుతుందో అఖిల్ కు కూడ తెలియని పరిస్థితి.


ఆమధ్య ప్రేమలో ఫెయిల్ అవ్వడం ఆతరువాత వరస పరాజయాలు రావడం ఇలా అనేక కారణాలతో అఖిల్ లో ఆధ్యాత్మిక చింతన చాల చిన్న వయసులోనే మొదలైంది అనుకోవాలి. దీనికితోడు అఖిల్ కు ప్రియ స్నేహితుడైన రామ్ చరణ్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అయ్యప్ప మాల వేసుకుంటాడు కాబట్టి అఖిల్ లో ఇలాంటి మార్పుకు పరోక్షంగా కారకుడయ్యాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ లేటెస్ట్ మూవీని దసరా కు విడుదల చేయాలని భావిస్తున్న పరిస్థితులలో ఈ ఆధ్యాత్మిక చింతన అఖిల్ కు ఏమాత్రం విజయానికి నాంది పలుకుతుందో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: