తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ పూర్ణ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈమె అసలు పేరు శ్యామ్నా కాసిం. ఈమెది కేరళ. పూర్ణ తన బాల్యం నుంచి విద్యాభ్యాసం, తన జీవన విధానం అంతా కూడా కేరళలోనే. తెలుగు ఇండస్ట్రీలో 2007 శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అనంతరం అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమ టపాకాయ సినిమాలో నటించింది. 

IHG

 


ఇక 2012 లో రిలీజ్ అయిన అవును సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇక అవును - 2, రాజు గారి గది - 2 సినిమా లో కూడా పూర్ణ ప్రత్యేక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పూర్ణ తన స్వస్థలం అయిన కేరళలో కొన్ని రోజులుగా ఉంటుంది. ఈ బ్యూటీని నలుగురు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చేసుకొని బెదిరించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆమెను డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించడం జరిగింది.

IHG

 


దీనితో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు విచారణ మొదలు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న మొత్తం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక ఈ నలుగురు గతంలో కూడా పలువురు సెలబ్రెటీలను బెదిరించి ఇలానే పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు. ఈ సంఘటనపై విచారణ పూర్తి చేసుకున్న అనంతరం నలుగురికి  జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: