అల వైకుంఠపురములో సూపర్ హిట్ తో మళ్లీ కెరియర్ లో ఫుల్ జోష్ చూపిస్తున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ లేకుంటే ఈపాటికి సినిమా సెట్స్ మీద ఉండేది కాని ఆ సినిమా షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్ వేశారు. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 

ఈ సినిమాను కూడా గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందట. సినిమా కోసం కొరటాల శివకు 15 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బన్ని కోసం రాసుకున్న లైన్ తో మెగా కాంపౌండ్ ను సర్ ప్రైజ్ చేశాడట కొరటాల శివ ఈ మూవీని కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిన్రజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమాలో రాం చరణ్ ను కూడా భాగం చేస్తున్నాడు.

 

మెగాస్టార్ మూవీ తర్వాత మరో మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల శివ అంటే తప్పకుండా సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కథ ఎలా ఉంటుంది.. ఎంత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్న కొరటాల శివ ఎలాంటి సామాజిక అంశాన్ని తీసుకుంటారు అన్న విషయాల మీద ఓ క్లారిటీ రావాల్సి ఉంది.                      

మరింత సమాచారం తెలుసుకోండి: