టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్సక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, క్రేజ్, ఫ్యాన్స్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మన దేశంలో బాలీవుడ్ నటులు అందుకుంటున్న రేంజ్ పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ సినిమా వస్తుంది అంటే, విదేశాలతో పాటు మన దేశంలోని ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రభాస్ కు ఎందరో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. 

IHG's next?

ఇక ఇటీవల సుజీత్ దర్శకత్వంలో ఆయన నటించిన సాహో సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో, ప్రస్తుతం రాధాకృష్ణ దర్శత్వంలో నటిస్తున్న సినిమా తప్పకుండా సక్సెస్ అయి తీరుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్లు కలిసి ఎంతో భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాయి. లాక్ డౌన్ అనంతరం ప్రస్తుతం షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వం నుండి అనుమతి లభించడంతో అతి త్వరలో తమ సినిమాని మొదలెట్టేలా ప్లాన్ చేస్తోందట యూనిట్. 

 

ఇకపోతే ఈ సినిమా కథ, కథనాల విషయమై హీరో ప్రభాస్ కూడా ఎంతో జాగ్రత్త వహిస్తున్నట్లు ఇన్నర్ టాక్. సాహో లో ఎంతో భారీ ఖర్చు, భారీ హంగులు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి ఉన్నప్పటికీ, కథ కథనాలు మాత్రం ప్రేక్షకుల నాడిని పట్టుకోలేకపోయాయని, అందుచేత ఈ సినిమాతో ఎలాగైనా ప్రేక్షకులు, అభిమానులను మెప్పించాలని ఎప్పటికప్పడు సినిమా విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారట ప్రభాస్. మరి సాహోతో కొంత మేర నిరాశ చెందిన తన ఫ్యాన్స్ కు, ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఎటువంటి విజయాన్ని అందిస్తారో చూడాలి. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా అతి త్వరలో రిలీజ్ కానుంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: