నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి మోనార్క్ అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు చిత్ర బృందం. గతంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా, ‘లెజెండ్’ సినిమాలతో బాలకృష్ణ కి భారీ హిట్స్ ని ఇచ్చాడు. దాంతో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా రూపొందుతుంది. ద్వారక క్రియోషన్స్ బ్యానర్ లో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అన్న విషయం తెలిసిందే. 

 

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒక పాత్ర అఘోర పాత్ర అని బోయపాటి వెల్లడించారు కూడా. అంతేకాదు ఈ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు డిజైన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే బిబి3 ఫస్ట్ రోర్ అంటూ వచ్చిన టీజర్ సంచలనం సృష్ఠించింది.

 

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కొన్ని రోజులుగా తెర మీదకి కీర్తి సురేష్, అంజలి, కన్నడ హీరోయిన్ అని..ఇలా చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. కాని రీసెంట్ గా శ్రియ శరణ్ అంజలి నటిస్తుందంటూ అఫీషియల్ గా త్వరలో అనౌన్స్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. దాంతో అందరికి ఇక బాలయ్య సినిమాలో హీరోయిన్స్ కంఫర్మ్ అయిపోయారనుకున్నారు.

 

కాని తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం బాలయ్య సరసన ప్రియమణి ని సెలెక్ట్ చేస్తారని అంటున్నారు. బాలయ్య పక్కన ప్రియమణి అయితే చాలా బావుంటుందన్న భావనతో తనతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇదే నిజమైతే ప్రియమణి బాలయ్య సినిమాలోకి ఎంటరయితే శ్రియ ..అంజలి లలో ఎవరు ఔట్ అవుతారో చూడాలి.  

 

 

ఇక రీసెంట్ గా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వెంకటేష్ తో నారప్ప..అలాగే రానా తో విరాట పర్వం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రియమణి బర్త్ డే సందర్భంగా ఈ రెండు చిత్ర బృందాలు ఆయా సినిమాలలో ప్రియమణి లుక్ ని రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపారు. ఆ లుక్స్ రిలీజైనప్పటి నుంచి పలువురు సీనియర్ హీరోలు ప్రియమణి ని తమ సినిమా కోసం సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: