మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంతకముందే ఆహా అనే ఓ డిజిటల్ యాప్ ను ప్రేక్షకులను పరిచయం చేశారు. కాని సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండి ఆ యాప్ అంతగా పట్టించుకోలేకపోయారు. అయితే గత మూడు నెలలుగా సినిమా నిర్మాణాలన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్ ఇంకా ఎంతకాలం ఉంటుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

 

దాంతో నిర్మాతలు కొత్త సినిమాలు నిర్మించాలన్నా భయపడుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి ఎలాగైనా పూర్తి చేయాలని ఆయా సినిమా నిర్మతాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా పూర్తయి రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలని ఏం చేయాలో ఎలా రిలీజ్ చేస్తే కనీస లాభాలొస్తాయో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు.

 

దీంతో ఇదే మంచి అవకాశం అని భావిస్తున్న అల్లు అరవింద్ ఆహా ను జనాలలోకి తీసుకు వెళ్ళేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు, కంటెంట్ రైటర్లను రంగంలోకి దింపి కథలు..వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఇందులో భాగంగా తన టీం లోకి మిల్కీ బ్యూటీ తమన్నా ని తీసుకున్నారని తాజా సమాచారం.

 

ఇప్పటికే హెబ్బా పటేల్ తో ఆహాలో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. అలాగే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుందట. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ తమన్నా ని వెబ్ సిరీస్ కి కాకుండా హోస్ట్ గా మార్చబోతున్నారు. తమన్నా కూడా ఇందుకు రెడీ అయిందట. ఇప్పటికే స్టార్ హీరోలందరు పాపులర్ టాక్ షోస్ తో జనాలకి బాగా దగ్గరవుతున్నారు.

 

హీరోయిన్స్ లో ఇప్పుడు తమన్నా కూడా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతుంది. ఇక తమన్నా ప్రస్తుతం సీటీ మార్ అన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్నాడు. గోపీచంద్ తమన్నా కబడీ కోచ్ లు గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: