డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ "జనగణమన"...అని ఇటీవల వెల్లడిస్తూ త్వరలో తన డ్రీం ప్రాజెక్ట్ ని మొదలు పెడతానంటూ ఫ్యాన్స్ కి ఒక ఉత్సాహభరితమైన వార్త ని వదిలాడు. అయితే వాస్తవంగా ఈ కథ కొన్నేళ్ళ క్రితమే రాసిపెట్టుకున్న పూరి.. మహేష్ బాబు తప్ప మరెవరూ చేయరు అంటూ పూరి చాలా సందర్భాలలో ఓపెన్ గా వెల్లడించారు. అంతేకాదు ఈ కథ ప్రత్యేకంగా మహేష్ బాబు కోసమే రాశానని...ఎప్పటికైనా ఆయన తోనే తెరకెక్కిస్తాని పట్టుదలగా చెప్పాడు. 

 

ఈ నేపథ్యంలోనే జనగణమన తన డ్రీం ప్రాజెక్ట్ అనగానే అది మహేష్ బాబు కోసమే అంటూ మహేష్ ఫ్యాన్స్ తెగ చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఒకవైపు బాలయ్య ఫ్యాన్స్ కూడా జనగణమన మా బాలయ్య కోసమే అంటు ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు కారణం పూరి లాక్ డౌన్ సమయంలో ఒక కథ సిద్దం చేసి అది బాలయ్యకి ఒకే చేయించుకున్నట్టు వార్తలు రావడమే. అయితే పూరి బాలయ్యతో జనగణమన తెరకెక్కిస్తాడా లేదా తెలీదు గాని.. మహెష్ బాబు తో మాత్రం కాదని ఖచ్చితంగా తెలుస్తుంది.

 

అందులో రెండు కారణాలు. ఒకటి ప్రస్తుతం మహేష్ బాబు సరకారు వారి పాట కమిటయ్యాడు. వచ్చే డిసెంబర్ లోపు ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో రాజమౌళి సినిమా తప్ప మరో సినిమాని చేయని తనకోసం వస్తున్న మేకర్స్ అందరికి తేల్చి చెబుతున్నాడట. ఇక రెండో కారణం ...పూరి రాసిన జనగణమన కథ గతంలోనే మహేష్ బాబు కి నచ్చలేదని అందుకే నిర్మొహమాటం గా పూరికి చేయనని చెప్పాడట.

 

కాని పూరి బద్రి సీన్ గుర్తు చేసుకొని ఎక్కడైనా నమ్మకంతో మళ్ళీ ఓకే చెప్తాడన్న నమ్మకంతో ఉన్నాడట. కాని కథ కుదిరితే వేరే కథ తో చేస్తాడు తప్ప పూరి రాసుకున్న జనగణమన కథ మాత్రం కాదని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: