'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సినిమాలు భారీ రేంజ్ లో నిర్మాణం జరుపుకునే దిశగా సీన్ మారిపోయింది. అంతకుముందు కూడా రాజమౌళి తీసిన సినిమాలు భారీ స్థాయిలోనే ఉన్నాగాని బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మాత్రం రాజమౌళి రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అటువంటిది ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' కి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ ఎఫెక్ట్ లేకపోతే మొత్తం సినిమా కంప్లీట్ అయ్యేది గాని, కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ వలన సినిమా షూటింగులు ఆగిపోవటంతో 'RRR' సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

 

ఈ పరిణామంతో సినిమా యూనిట్ కి టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే 'RRR' స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. అసలు సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే. మొదటిలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించాల్సిన లండన్ ముద్దుగుమ్మ ఒక్కసారిగా హఠాత్తుగా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆ తరువాత ఒలీవియా మోరిస్ ను ఎంపిక చేసుకోవడానికి రాజమౌళి చాలా టైం తీసుకోవటం జరిగింది. ఎలాగైతే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత హీరోలు రామ్ చరణ్ కి మరియు ఎన్టీఆర్ కి గాయాలు అవడంతో పూణే లో జరగాల్సిన సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది.

 

దీంతో ఈ ఏడాది జూన్ మాసంలో విడుదల కావాల్సిన సినిమా , వచ్చే ఏడాది జనవరి మాసానికి వాయిదా పడింది. సరే జరిగిందేదో జరిగింది అప్పటికైనా విడుదల చేద్దామని అనుకుంటే ప్రజెంట్ మొత్తం లాక్ డౌన్ రావటం జరిగింది. ఈ ఎఫెక్ట్ తో ఇప్పటికే మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే రీసెంట్ గా ప్రభుత్వాల నుండి షూటింగులకు అనుమతులు లభించినప్పటికీ డైరెక్టర్ రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేయలేకపోయాడట. కాగా మరికొద్దిరోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నా 'RRR' సినిమా యూనిట్ కి గట్టి షాక్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. హీరోలిద్దరూ సినిమా షూటింగ్ చేయడానికి ఒప్పుకోలేదట. రోజు రోజుకి కేసులు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో షూటింగ్ స్టార్ట్ చేయడం మంచిది కాదని డైరెక్టర్ రాజమౌళి కి ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలియజేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ పరిణామంతో రాజమౌళి సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు...ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: