పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది రేణుదేశాయ్. ఆ సినిమా తర్వాత 'జానీ' సినిమాలో నటించింది. ఇక జానీ సినిమా తర్వాత దాదాపు సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. ఇదిలా ఉండగా మళ్ళీ రేణుదేశాయ్ తెలుగు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. తనకి తగ్గ ఆఫర్లు వస్తే నటించడానికి అభ్యంతరం లేదని ఇటీవల రేణు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీంతో రేణుదేశాయ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఓ భారీ ఆఫర్ రేణుదేశాయ్ కి వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

IHG

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాల్లో నటించేందుకు రేణు దేశాయ్ కి ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. అడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో 'మేజర్' అనే సినిమాని మహేష్ బాబు బ్యానర్ మరియు సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 26/11 ముంబై దాడులలో టెర్రరిస్టుల తో పోరాడుతూ ప్రాణం కోల్పోయిన ఓ భారతీయ సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది . అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రేణుదేశాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ADIVI SESH' target='_blank' title='adivi sesh -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>adivi sesh </a>Doing with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN' target='_blank' title='pawan- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan</a> Kalyan's Son?

సినిమాలో ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ, చాలా పవర్ ఫుల్ పాత్ర కావడంతో  రేణుదేశాయ్ అంగీకరించే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రేణుదేశాయ్ కుటుంబానికి హీరో అడివి శేష్ ఎంతో సన్నిహితంగా మంచి సంబంధాలు ఉండటంతోపాటు, రేణు దేశాయ్ కొడుకు అకీరా నందన్ కి అడివి శేష్ ఫేవరెట్ హీరో అవటంతో… ఖచ్చితంగా రేణుదేశాయ్ ఈ సినిమా ప్రాజెక్టు ఓకే చేసే అవకాశం ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: