ట్రెండ్ కు తగినట్టుగా అవకాశాలు అందుకోవడం కొందరు హీరోయిన్స్ కు బాగా అలవాటు. వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా అయితే ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. మంచు మనోజ్ శ్రీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి హ్యాపీడేస్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక అప్పటి నుండి వరుస స్టార్ ఛాన్సులతో అదరగొట్టింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దశాబ్ధ కాలంగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది తమన్నా. ఈమధ్య వెటరన్ హీరోల సరసన నటించడానికి సై అంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా ఓ ఓటిటి కోసం స్పెషల్ షో చేస్తుంది.

 

అల్లు అరవింద్ మైహోం రామేశ్వర రావు భాగస్వామ్యంలో అహా ఓటిటి మొదలైన విషయం తెలిసిందే. ఆహా ఇప్పటికే ఆడియెన్స్ ను అలరిస్తుండగా వెరైటీ షోస్ తో ఇంకాస్త ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేస్తున్నారు. అందులో భాగంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ స్పెషల్ షో స్టార్ట్ చేస్తున్నారట. ఈ షో కోసం తమన్నా రాం చరణ్, రవితేజ హెల్ప్ తీసుకుంటుందని తెలుస్తుంది. సెలబ్రిటీ టాక్ షో అనగానే అందరికి ఆసక్తి ఉంటుంది. అందులోనూ తమన్నా లాంటి అందగత్తె చేస్తుంది అంటే ఆ షోకి వచ్చే క్రేజే వేరు.

 

ఆహాలో కొత్తగా ప్లాన్ చేస్తున్న ఈ షో హోస్ట్ గా తమన్నా చేస్తుందట. ఇక మొదటి ఎపిసోడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ ది ఉంటుందని టాక్. తమన్నాతో చరణ్ రచ్చ సినిమా చేశాడు. ఆ సినిమాలో వీరిద్దరి కాంబోకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక రవితేజతో కూడా బెంగాల్ టైగర్ సినిమా చేసింది. ఆహాలో మొదటి ఎపిసోడ్ వీళ్లతో చేస్తుందని తెలుస్తుంది. మరి చరణ్, రవితేజలతో తమన్నా చేస్తున్నా ఈ కొత్త క్రేజీ అటెంప్ట్ ఎలాంటి అవుట్ పుట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: