ప్రస్తుతం ఓటీటీల హవా బాగా నడుస్తోంది. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతబడిపోవడంతో ఓటీటీ వేదికలకి డిమాండ్ బాగా పెరిగింది. జనాలు సినిమాలు, వెనబ్ సిరీస్ లని చూస్తూ ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. అయితే ప్రస్తుతం ఓటిటీల్లో టాప్ గా నిలిచిన వాటిలో నెట్ ఫ్లిక్స్ తో పాటు ప్రైమ్ కూడా ఒకటి. ఈ రెండూ మేజర్ షేర్ ని ఆక్రమించాయి. అయితే వీటికి పోటీగా కాకపోయినా వందశాతం తెలుగు కంటెంట్ తో తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

 

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ యాప్ ని స్టార్ట్ చేసాడు. ఈ వేదికగా ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా భానుమతీ రామక్రిష్ణ చిత్రం జులై 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనుంది. అంతేగాక ప్రస్తుతం ఆహా యాప్ కంటెంట్ ని పెంచడానికి అల్లు అరవింద్ పెద్ద ప్లానింగ్ తో ఉన్నాడు. కొత్త కొత్త వెబ్ సిరీస్ లతో పాటు టాక్ షోస్ కూడా స్టార్ట్ చేయనున్నాడట. 

 

అయితే ఇదిలా ఉంటే తాజాగా తెలుగు వారి కోసం మరో ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ రెడీ కాబోతుంది. పాపులర్ యాక్టర్, మేనేజర్ అయిన రాజారవీంద్ర తన స్నేహితులతో కలిసి ఈ వేదికని స్టార్ట్ చేయనున్నారట. ఈ మేరకు కొత్త దర్శకులు, రచయితలకి అవకాశం దొరకనుందట. మరికొద్ది రోజుల్లో ఈ ఫ్లాట్ ఫామ్ రెడీ అవబోతుందని చెబుతున్నారు. వంద సినిమాలని కొనుక్కుని పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారట.

 

ఆల్రెడీ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటితో పోటీకి దిగిన ఆహాకి పోటీగా వస్తున్న మరో తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలకి మంచి డిమాండ్ ఉండడంతో జనాలు కొత్త కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాజారవీంద్ర స్టార్ట్ చేయబోయే స్ట్రీమింగ్ సైట్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: