సినిమాలో పవర్ ఫుల్ డైలాగులు హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఆ పవర్ ఫుల్ డైలాగులు సినిమాలో బాగా పేలతాయి. అవి ట్రెండ్ సెట్టింగ్ డైలాగులుగా నిలబడిపోవడమే కాకుండా సినిమా విజయంలో కీలకంగా నిలుస్తాయి. వెటరన్ టాప్ హీరోయిన్ వాణిశ్రీ తన కెరీర్లో పలు సినిమాల్లో అత్త పాత్రలు పోషించారు. ఆయా పాత్రల్లో ఆమె తన కంఠస్వరంతో పలు అద్భుతమైన డైలాగులు పలికారు. అత్తగా ఆమె నటించిన సినిమాల్లో వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘బొబ్బిలి రాజా’ ఒకటి. ఈ సినిమాలో వెంకటేశ్, వాణిశ్రీ పోటాపోటీగా నటించారు.

IHG

 

ఈ సినిమాలో అత్తగా వాణిశ్రీ తన నటనలోని పవర్ చూపించారనే చెప్పాలి. వెంకటేశ్ కు వాణిశ్రీకి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సినిమాలో వాణిశ్రీ రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా నటించారు. వెంకటేశ్ ఆమె మేనల్లుడిగా నటించాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో వాణిశ్రీ చెప్పిన డైలాగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ‘రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ.. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయను’ అనే డైలాగ్ సినిమాలో పేలిపోయింది. కథలో ఉండే టెంపోని ఈ డైలాగ్ ప్రతిబింబించిదనే చెప్పాలి. సినిమాలో వాణిశ్రీ పాత్రకు మంచి పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి.

IHG

 

వెంకటేశ్ పాత్రకు కూడా మంచి డైలాగులు ఉండటంతో వాణిశ్రీ పాత్ర మరింత పవర్ ఫుల్ గా వచ్చింది. డబ్బైల్లో వాణిశ్రీ అప్పటికి నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించారు. ఆమె వాయిస్ లోని పవర్ తో ఏ సినిమాలో అయినా డైలాగ్ డెలివరీ అదేస్థాయిలో ఉండేది. ఆమె నటనకు గీటురాయిగా ఉండే పాత్రలు దక్కితే మరింత ఎలివేట్ అయ్యేవారు. చిరంజీవితో చేసిన అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమా కూడా ఆమె ఇదే స్థాయి నటన ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: