ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పరిస్థితుల్లో హీరోయిన్ ల కోసం ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితి అయితే దాదాపుగా లేదు అనే చెప్పాలి. హీరోయిన్ ల విషయంలో ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వారికి సినిమాల్లో పాత్రలు ఇచ్చే పరిస్థితి అయితే టాలీవుడ్ లో ఉంది అనేది వాస్తవం. ఇప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగానే హీరోయిన్ లను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు అనేది వాస్తవం. ఇక మన తెలుగు లో అయితే హీరోయిన్ కోసం ఎక్కువగా ఖర్చు చేయవద్దు అనే భావన లో ఉన్నారు టాలీవుడ్ పెద్దలు కూడా. 

 

ఇక ఈ తరుణంలో పూజ హెగ్డే ఒక నిర్ణయం తీసుకుంది అని టాక్. ఆమెకు సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నా సరే నిర్మాతల గురించి ఆమె ఆలోచించింది అనే విధంగా ఒక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఏంటీ అంటే... ఇక నుంచి సినిమాలకు కొంత ధర అంటే... ప్రతీ సినిమాకు కనీస ధర తీసుకోవాలి అని ఆమె చూస్తుంది. ఉదాహరణకు ఆమె గతంలో 2 కోట్లు తీసుకుని ఉంటే ఇప్పుడు  దానిని కోటి రూపాయలకు తగ్గించి ఇక సినిమా లాభ నష్టాల ఆధారంగా మిగిలిన మొత్తం తీసుకోవాలి అని భావిస్తుంది. 

 

ఇదే విషయాన్ని టాలీవుడ్ లో ఆమె తో సినిమా చెయ్యాలి అని భావించిన వారికి చెప్పింది అని సమాచారం. వారు కూడా అందుకు ఓకే అన్నారు అని తెలుస్తుంది. మహేష్ తో ఆమె ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. ఆ సినిమాలో ఆమె ఆ విధంగానే వసూలు చేస్తుంది అని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేస్తుంది అని ఆ సినిమాలో కూడా ఆమె అదే విధంగా తీసుకునే అవకాశం ఉంది అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: