టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయకపోయినా సరే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ఎప్పుడు కూడా ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. ఆమెకు ఏదోక ఆఫర్ వచ్చినట్టు వార్తలు వస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ తో చేస్తుంది మహేష్ తో చేస్తుంది అంటూ ఎవరో ఒకరు ఏదోక ప్రచారం ఆమె గురించి చేస్తూ ఉంటారు. ఆమె కూడా అదే విధంగా సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉండటం తో జనాలు కూడా ఆమె గురించి ఎక్కువగా చదవడం మొదలు పెట్టారు. ఏ వార్త వచ్చినా సరే అది నిజం అయినా కాకపోయినా ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో జరుగుతుంది అని చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటీ అంటే... ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ తప్పుకుంది అని ఆ స్థానం లో ఆమెను ఎంపిక చేసారు అని అంటున్నారు జనాలు. నిజమా కాదా అనేది తెలియదు గాని ఆమె మాత్రం నటించడం ఖాయమని త్వరలోనే దీనికి సంబంధించిన ఒక ప్రకటన వస్తుంది అంటున్నారు. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటుంది అని తండ్రి కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కోసం ఇక్కడే ఉంది అని అందుకే ఆమె తో రాజమౌళి మాట్లాడారు అని సమాచారం. ఇక అలియా భట్ కంటే కూడా ఆమెకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. 

 

అందుకే ఆమెను అడిగారు అని ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది గాని కాస్త ఎక్కువగా డిమాండ్ చేసింది అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే మాత్రం కొన్ని రోజులు ఆగాలి. ఇప్పుడు ఆమె  బాలీవుడ్ లో ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి లాక్ డౌన్ లో వాయిదా పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: