బుల్లితెర మీద జబర్దస్త్ సందడి మొదలైంది.. కరోనా ప్రభావంతో 3 నెలలుగా కామెడీని మిస్సైన స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ అందరికి జబర్దస్త్ ఎక్స్ ట్రా జోష్ తో వచ్చింది. ఇక 3 నెలలు గ్యాప్ వచ్చినా సరే స్కిట్లు మాత్రం అదరగొడుతున్నారు. ఆఫ్టర్ షార్ట్ గ్యాప్ వచ్చిన జబర్దస్త్ లొ కొన్ని సర్ ప్రైజులు జరిగాయి. తాగుబోతు రమేష్, షకలక శంకర్ లు మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లు టీం లీడర్స్ గా చేస్తున్నారు. జబర్దస్త్ మొదట్లో తాగుబోతు రమేష్ చేశాడు కాని సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఎగ్జిట్ అయ్యాడు.

 

ఇక షకల శంకర్ కూడా ఈ ఫ్లాట్ ఫాం మీద వచ్చిన క్రేజ్ తో హీరోగా కూడా సినిమాలు చేశాడు. మళ్లీ ఆడియెన్స్ తనని మర్చిపోతారేమో అన్న కారణంతో బ్యాక్ టూ పెవిలియన్ అన్నట్టుగా జబర్దస్త్ చేస్తున్నాడు. ఇక ఎప్పటిలానే హైపార్ ఆది పంచుల ప్రవాహం నడుస్తుంది. విశేషం ఏంటంటే ఈ 3 నెలల గ్యాప్ లో జరిగిన అన్ని విషయాల మీద ఆది పంచులు ఉన్నాయి. తన టీం లో చేస్తున్న దొరబాబు, పరదేశిలు వైజాగ్ లో వ్యభిచార హృహంలో పట్టుబడగా ఇక వాళ్లకు జబర్దస్త్ స్టేజ్ ఎక్కించే అర్హత లేదని అనుకున్నారు.

 

కాని ఆది ఎందుకో వాళ్లని క్షమించి మళ్లీ తన టీం లో కొనసాగించేలా చేశాడు. అయితే ఇదివరకు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇవ్వకుండా జస్ట్ ఏదో అలా రెండు మాటలు మాట్లాడేలా చేశాడు. ఇక ఈ వారం ఆల్రెడీ ఆది బిబి 3 డైలాగ్ తో బాలకృష్ణని టార్గెట్ చేసిన ఆది వచ్చే వారం కూడా భైరవద్వీపం సినిమాలో బాలకృష్ణలా ప్రోమోలో కనిపించాడు. ఇది కూడా ఇన్ డైరెక్ట్ గా బాలకృష్ణని టార్గెట్ చేసినట్టే అంటున్నారు. మెగా ఫ్యామిలీని బాలకృష్ణ టార్గెట్ చేస్తే ఆది బాలయ్య బాబుని టార్గెట్ చేస్తూ స్కిట్స్ చేస్తున్నాడు. మరి నందమూరి ఫ్యాన్స్ నుండి ఇదివరకే వార్నింగులు గట్రా ఎదుర్కున్న ఆది ఈసారి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేస్తున్నాడో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: