సాక్షి రంగారావు కామెడీకి...కన్నింగ్ విలన్ పాత్రకు అతికినట్లుగా సరిపోయేవారు. 1967లో మొదలైన ఆయన సినీ ప్రయాణం దాదాపు 47సంవత్సరాల పాటు సాగింది. జీవిత చరమాంకం వరకు కూడా ఏనాడు ఆయన నటించకుండా విరామం తీసుకోలేదంటే అతిశేయోక్తి కాదు. బాపు రమణాల చిత్రాల్లో ఆయన తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. వారు తెరకెక్కించిన చిత్రాల్లో ఆయన లేకుండా ఉన్నవి లేవట్టే ఆయన నటనకు వారెంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే కళా తపస్వి కె. విశ్వనాథ్ చిత్రాల్లో కూడా ఎక్కువగా నటించారు. ఆయన చివరి చిత్రం కూడా కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 2005లో వచ్చిన స్వరాభిషేకం కావడం గమనార్హం.
సాక్షి రంగారావు సెప్టెంబర్ 15, 1942లో గుడివాడ వద్ద నున్న కొండిపర్రు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు రంగనాయకమ్మ, లక్ష్మినారాయణ. ఈయన నటించిన మొదటి సినిమా 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ కూడా నటుడే. ఆయన సుమారు 450 సినిమాల్లో నటించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవాడు.
మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. 2005, మే 5 వతేదీన గురజాడ వారి నాటకం కన్యాశుల్కం (నాటకం)లో గిరీశం పాత్రకు ఆయన రిహార్సల్ చేస్తుండగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కు తరలించిన తరువాత తుదిశ్వాస విడిచారు. ఆ నాటకంలో ఆయనకది డ్రీమ్ రోల్ అని తరచూ చెబుతూ ఉండేవారు. చక్కెర వ్యాధి ముదిరి మూత్రపిండాలు పాడయిపోవడంతో చెన్నై వైద్యశాలలో జూన్ 27, 2005 రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు. నీ కామెడీ కోసం...నీ విలనిజం కోసం...నీ అమయాక పేదవాడి పాత్రకోసం..ఎదురు చూస్తోంది తెలుగు సినీలోకం... ఈరోజు సాక్షి రంగారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు హెరాల్డ్ తరుపున నివాళి అర్పిస్తూ..