పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని తెలిసినప్పటి  నుండి అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అజ్ఞాతవాసి సినిమా చివరి చిత్రం అని చెప్పినపుడు పవన్ అభిమానులు ఎంత నిరాశ చెందారో తెలిసిందే. ఒక గబ్బర్ సింగ్ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ అందించి రాజకీయాల్లోకి వెళ్ళినా బాగుండేది అన్న మాటలు వినిపించాయి. దాంతో చాలా మంది అభిమానులు పవన్ అభిమానులు, పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తే బాగుండేదని అనుకున్నారు.

 

అయితే వారి ఆశలని నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రమైన పింక్ సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. అయితే ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. పవన్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది.

 


పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడు. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా పాటల విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉండనున్నాయట. అవి కూడా బ్యాగ్రౌండ్ లో వచ్చేవే అయి ఉంటాయని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, ఈ సినిమా  పాటల్లో డాన్సులు ఉండకూడదని చెప్పాడట. 

 


అయితే దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా ఆక్టివ్ గా ఉంటున్నారు. ఏ సమస్య మీద అయినా తన గొంతుకని వినిపిస్తున్నారు. రాజకీయాల్లో చాలా ఆక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్, తెర మీద డాన్సులు, హీరోయిన్ తో రొమాన్సులు చేస్తే ప్రజల్లో పార్టీమీద ఒకరకమైన అభిప్రాయం ఏర్పడుతుందన్న ఉద్దేశ్యంతో అలాంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: