ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్ రిలీజ్ ప్లాన్స్ మారుతున్నాయి. ఇప్ప‌టికే ఈ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ సినిమా క‌రోనా నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో రిలీజ్ కూడా వాయిదా ప‌డింది. ఈ సినిమాకు సంబంధించి మ‌రో 30 రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఎంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని చూస్తున్నా క‌రోనా మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు రాజు స్పీడ్ కు బ్రేకులు వేస్తూ వస్తోంది. 

 

ఇక ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని రాజు భావిస్తున్నాడ‌ట‌. వాస్త‌వానికి సంక్రాంతికి మెగా స్టార్ చిరు - కొర‌టాల శివ కాంబోలో వ‌స్తోన్న ఆచార్య సినిమాను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఇక సంక్రాంతికి రావాల‌నుకున్న ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలే ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆచార్య సినిమా సైతం ముందుగా సంక్రాంతికి రావాల‌నుకున్నా.. ఇప్పుడు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.

 

ర‌జ‌నీ కాంత్‌తో పాటు బాల‌య్య - బోయ‌పాటి సినిమా కూడా సంక్రాంతికి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇదే ఇప్పుడు వ‌కీల్ సాబ్‌కు వ‌రంలా మారింది. మ‌రో 30 రోజులు మాత్ర‌మే షూటింగ్ ఉండ‌డంతో సంక్రాంతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా థియేట‌ర్ల‌లోకి తీసుకు రావాల‌ని నిర్మాత రాజు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇదే కనుక నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు అంతకంటే ఇంకేం కావాలి. వాళ్లకు ఇదే పెద్ద పండగ. దాదాపు మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాను వాళ్లు ఎంచ‌క్కా థియేట‌ర్ల‌లో ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: