ఇప్పుడు మన తెలుగులో ఒక రెండేళ్ళ పాటు సినిమాల విషయంలో... జాగ్రత్తగానే ఉండే అవకాశం ఉంది. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే దాదాదాపుగా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదు అనే చెప్పాలి. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నా సరే...  సినిమాలను విడుదల చేయడం అనేది దాదాపుగా కష్టమే అని చెప్పాలి. టాలీవుడ్ పెద్దలు కూడా ఇప్పుడు సినిమాల విషయంలో కాస్త భయపడే  పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి.  టాలీవుడ్ లో ఇప్పుడు దాదాపుగా కూడా సినిమాలను వాయిదా వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇక చిరంజీవి రామ్ చరణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే రాబోయే రెండేళ్ళ వరకు కూడా  కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని సినిమా మొదలు పెట్టి అడ్వాన్స్ తీసుకుని... ఏ విధంగా కూడా సినిమాలు చేయవద్దు అని అనవసరంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టవద్దు అని భావిస్తున్నారట. రెండు మూడేళ్ళు కాస్త ఓపిక పడితే చాలు అని భావిస్తున్నట్టు సమాచారం. దానికి కారణం సినిమాల్లో  ఇప్పుడు ఉన్న పరిస్థితులే. అగ్ర హీరోలు గా ఉన్నారు ఇద్దరూ కూడా. 

 

నిర్మాతలను అనవసర౦గా అడ్వాన్స్ తీసుకుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనే భావన లో ఉన్నారు అని టాక్. మరి ఏ విధంగా ఇద్దరూ ముందుకు వెళ్తారో చూడాలి. పవన్ కళ్యాణ్, చిరంజీవి ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ మొదలు పెట్టాలి అని చూసినా సరే చిరంజీవి వద్దు అని చెప్పారు అని సమాచారం. వచ్చే ఏడాది ఆ ప్రాజెక్ట్ ని తీసుకుని వచ్చినా సరే కరోనా దెబ్బకు చూసే అవకాశం లేదని వెనక్కు తగ్గారు అని టాక్ మరి. చూడాలి అసలు ఏమవుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: