ఇప్పుడు టాలీవుడ్ లో చాలా వరకు యువ దర్శకుల హవా నడుస్తుంది. అగ్ర హీరోలు ఎక్కువగా యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాప్ అనేది చూడకుండా యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. చిరంజీవి నుంచి ప్రతీ ఒక్కరు కూడా ఇప్పుడు అదే విధంగా ఉన్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు మెహర్ రమేష్ కి అసలు ఏ మాత్రం కూడా డిమాండ్ లేదు అనే చెప్పాలి. కాని ఆయనకు అవకాశం ఇచ్చారు చిరంజీవి. అసలు ఆయాన్ను ఏ విధంగా నమ్మారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

 

లూఫిఫర్ రీమేక్ కి ఆయనకు అవకాశం ఇచ్చారు చిరూ. దీని తో ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో చాలా మందికి ఈ పరిణామం ఇప్పుడు కాస్త వింతగా ఉంది అని చెప్పాలి. సాధారణంగా చిరంజీవి యువ దర్శకులకు అవకాశాలు ఇచ్చే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి ఇస్తూ ఉంటారు. అలాంటిది ఆ కథను తెలుగు కి తగిన విధంగా రెడీ చెయ్యాలి అని ఆయనకు సూచనలు చేసారట చిరంజీవి. దీనిని చూసి చాలా మంది ఇప్పుడు షాక్ అవుతున్నారు. అసలు ఆయనను చిరంజీవి ఏ విధంగా నమ్మేశారు అంటూ పలువురు టాలీవుడ్ లో చర్చిస్తున్నారు. 

 

అయితే ఇప్పటికే కథను తెలుగు కి నచ్చిన విధంగా రెడీ చేసారట  మెహర్ రమేష్. అందుకే చిరంజీవి ఆ కథ విని ఓకే చేసారు అని అంటున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. ఆచార్య సినిమాలో ఇప్పుడు చిరూ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: