టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలి అని కీర్తి సురేష్ ప్రయత్నాలు చేస్తుంది. ఒక్క మంచి సినిమా స్టార్ హీరోతో చేసినా సరే చాలు అనుకునే పరిస్థితి లో ఉంది ఆమె. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా ఆమె తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఆమె నటనే కాదు ఫాలోయింగ్ విషయంలో కూడా చాలా మంది కంటే బెస్ట్ అని టాక్. అందుకే ఇప్పుడు ఆమె విషయంలో స్టార్ హీరోలు కూడా చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పాలి. మహేష్ బాబు ఎన్టీఆర్ తో పాటుగా పలువురు స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది. 

 

మహేష్ బాబు అయితే ఆమెకు స్వయంగా ఫోన్ చేసి సినిమా చెయ్యాలి అని అడిగారు అందుకు ఆమె భారీగా డిమాండ్ కూడా చేసింది అని టాక్. దానికి కూడా మహేష్ బాబు ఓకే చెప్పారు అని ఆమె సర్కారు వారి పాట లో నటించడం ఖాయమని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపుగా కీర్తి కోసం ఎదురు చూసే  హీరోలు ఉన్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆమె విషయంలో కాస్త ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు జనాలు. రామ్ చరణ్ ఆమె తో ఒక సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. 

 

ఆమె తో ఓటీటీ లో విడుదల చేసే ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఆమె స్పష్టత కూడా ఇచ్చింది అని సమాచారం. నిజం ఎంత ఏంటీ అనేది తెలియదు గాని ఈ విషయంలో మాత్రం ఇప్పుడు చర్చలు  అయితే జరుగుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా చేసే అవకాశం ఉంది అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: