సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో ఉంటుందనే విషయమై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వంశీపైడిపల్లి తో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ, స్క్రిప్టు నచ్చక ఊరుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం పరశురామ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు రాసారు. చివరికి అదే నిజమైంది. క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే టైటిల్ ని ప్రకటించారు.

 

అయితే సర్కారు వారి పాట సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో కథనాలు, ఇంకెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీ లుక్ పోస్టర్ లో చూపించినట్టు ఈ సినిమాని స్టైలిష్ గా తీర్చిదిద్దనున్నారట. ఇంతకుముందెన్నడూ కనిపించనంత స్టైలిష్ గా మహేష్ బాబు కనిపించనున్నాడట. అయితే ఈ సినిమాలో మాస్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయని చిత్ర దర్శకుడు పరశురామ్ చెప్పిన సంగతి తెలిసిందే.

 

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడప్పుడే మొదలు కాదని అంటున్నారు. అన్నీ కుదురుకున్న తర్వాత అక్టోబరులో షూటింగ్ మొదలెట్టాలని అనుకుంటున్నారట. అప్పటి వరకూ పరశురామ్ ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటినీ ముగించుకోవాలని చూస్తున్నాడట. అయితే ఈ సినిమా బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగనుందని చెబుతున్నారు. అందుకోసం బ్యాంకు సెట్ ని వేయాలని డిసైడ్ అయ్యారట.

IHG

ఎక్కువభాగం బ్యాంకులో షూటింగ్ నిర్వహించాల్సి ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో బ్యాంకు సెట్ వేయనున్నారట. ఈ మేరకు ఆర్ట్ డైరెక్టర్ ఏ యస్ ప్రకాష్ పని ప్రారంభించాడట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: