ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు హీరోలు పోటీపడటం కామన్. ఆ దర్శకుడిని లాక్ చేసేందుకు ఒకరినిమించి మరొకరు స్కెచ్చులేస్తుంటారు. అయితే ఒక దర్శకుడి కోసం మెగా హీరోలు వాళ్లల్లో వాళ్లే పోటీపడటం కాస్త విచిత్రంగా కనిపిస్తోంది. ముందు నేనంటే నేను అన్నట్టు డిస్కషన్స్ పెట్టడం ఇండస్ట్రీ జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. 

 

మెగా ఫ్యామిలీ మొత్తం ఒక టీమ్ లా ఉంటుంది. చిరంజీవి కెప్టెన్సీలో అందరూ బరిలో దిగుతుంటారు. అయితే ఇంత యూనిటీగా ఉండే మెగా టీమ్ ఇప్పుడు ఒక దర్శకుడి కోసం ఫైట్ చేస్తోంది. చిరంజీవి మూవీ ఎనౌన్స్ చేసిన దర్శకుడితో సినిమా చేసేందుకు రామ్ చరణ్ కూడా ట్రై చేస్తున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ త్రివిక్రమ్ తో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు.

 

చిరంజీవి సైరా టీమ్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. డి.వి.వి దానయ్య నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని ప్రకటించారు. పంచ్ మాస్టర్ మార్క్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఉంటుందనే టాక్ వచ్చింది. అయితే చిరు ఈ లోపు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మొదలుపెట్టాడు. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ రీసెంట్ గా రామ్ చరణ్ ని మీట్ అయ్యాడని చెబుతున్నారు. మాస్ మూవీస్ తో మెప్పించే చరణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయబోతన్నాడనే ప్రచారం జరుగుతోంది. సినిమా గురించి డిస్కషన్ జరిగాయనీ.. స్టోరీ ఫైనల్ అయ్యాక అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని సమాచారం. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా కర్చీఫ్ వేశారు. ఎవరికి ఛాన్స్ దొరికితే వాళ్లు సినిమా చేసేందుకు రెడీ అయిపోతున్నారు. స్టోరీ కంప్లీట్ చేస్తే చాలు కాల్షీట్స్ ఇచ్చేస్తామని చెబుతున్నారు. సో మొత్తంగా నలుగురు మెగాఫ్యామిలీ హీరోలు త్రివిక్రమ్ కోసం ట్రై చేస్తున్నారు. మరి పంచ్ మాస్టర్ వీళ్లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: