ఏడాది ప్రారంభంలో 'అలా వైకుంఠపురంలో' సినిమాతో అదిరిపోయే ఓపెనింగ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన 'అల వైకుంఠ పురంలో' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయటంతో బన్నీ మార్కెట్ అమాంతంగా పెరిగిపోయింది. కాగా సినిమా తర్వాత ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా అల్లు అర్జున్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ తరహాలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కరోనా వైరస్ రాకముందు సుకుమార్ కేరళ రాష్ట్రంలో దట్టమైన అడవులలో ప్లాన్ చేశారట. కాగా తర్వాత కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ఏర్పడటంతో సినిమా షూటింగ్  ఆగిపోవటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వాల నుండి సినిమా షూటింగ్లకు అనుమతులు వచ్చినా ఇతర రాష్ట్రాలలో సినిమా షూటింగులు చేసే పరిస్థితి లేదు.

 

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా కోసం సరికొత్త ప్లాన్ సుకుమార్ వేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కేరళ తరహా దట్టమైన అడవుల లోకేషన్ ఒకటి చూసినట్లు ఆ ప్రాంతంలోనే 'పుష్ప' సినిమా షూటింగ్ చేయడానికి సుకుమార్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ అడవులలో ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరు కూడా షూటింగ్ జరుపుకో లేదంట. నల్గొండ జిల్లా ప్రాంతంలో బయట పడిన ఈ లొకేషన్ పుష్ప సినిమాకి కరెక్ట్ గా సూట్ అయ్యే లొకేషన్ అని సుకుమార్...ఈ అడవులలో సినిమా తీయాలని డిసైడ్ అయిపోయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: