డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి వరసగా ఫ్లాప్స్ వస్తుండటంతో హీరోలెవరూ పూరి తో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. దాంతో తన కొడుకు ఆకాష్ నే పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. తీశాడు... అదే మెహబూబా. ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాని పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. పూరికి కమర్షియల్ గా లాస్ మిగిలింది. అయితే పూరి కొడుకుకి మాత్రం హీరో మెటీరియల్ ..మంచి ఫ్యూచర్ ఉంది అన్న ప్రశంసలు దక్కాయి. యాంక్టింగ్..యాక్షన్ సీన్స్ ..ఎమోషన్స్ ..ఇలా అన్నిటిలో ఆకాష్  మంచి పర్ఫార్మర్ అని హీరోగా మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. 

 

దాంతో పూరి ఎలాగైనా తన కొడుకుని హీరోగా నిలబెట్టాలని తాపత్రయపడుతున్నారు. అందుకే మరో సినిమాని ప్లాన్ చేశాడు.  పూరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ పాడూరి కి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. రొమాంటిక్ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యూత్ ని టార్గెట్ చేసి ఈ సినిమాని పక్క రొమాంటిక్ సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఇక ఈ సినిమా దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమా మిగతా షూటింగ్ ని కంప్లీట్ చేసేందుకు పూరి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడానికి పూరి ప్లాంచేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకు కారణాలు రెండు. ఒకటి రీసెంట్ గా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఓటీటీలో రిలీజై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. మరొక కారణం తన గురువు రాం గోపాల్ వర్మ నెలకొక అరగంట సినిమాని తీసి రిలీజ్ చేస్తున్నారు.

 

దాంతో పూరి తన కొడుకు సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం మొదలైది. కాని అందులో వాస్తవం లేదని విశ్వనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. థియోటర్స్ లోనే రొమాంటిక్ సినిమాని రిలీజ్ చేస్తామని పూరి టీం అంటున్నారట. సినిమా పక్కా హిట్ అన్న నమ్మకం కూడా ఇందుకు ముఖ్య కారణం అని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: