క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తే మాత్రం దర్శకుడు కొత్తవాడా .. ఫ్లాపుల్లో ఉన్నాడా..కథ రీమేక్ ఆ అని ఆలోచించరు విక్టరీ వెంకటేష్. కథ అద్భుతంగా ఉంది ఆ కథ లో వెంకీ ఖచ్చితంగా సూటవుతాడు ..ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే వెంటనే ఆ సినిమా చేసేస్తాడు. అలా వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలే రాజా, చంటి, వసంతం, సంక్రాంతి ..లాంటి సినిమాలు.

 

ఇప్పుడు కూడా మరోసారి సూపర్ హిట్ తమిళ ‘అసురన్’ రీమేక్ లో నటిస్తున్నాడు. తెలుగులో ‘నారప్ప’గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ సినిమాలతో వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్ ఆ సక్సస్ ని కంటిన్యూ చేస్తారన్న నమ్మకం నారప్ప ఫస్ట్ లుక్ తో అర్తమైపోయింది. ఇక ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

ఇక యంగ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం. సాయి పల్లవి ప్రియమణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రానా తో పాటు సాయి పల్లవి, ప్రియమణి ల లుక్స్ రిలిజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో ఈ ముగ్గురు అకౌంట్ లోనే కాదు ప్రతిష్టాత్మకమైన సురేష్ ప్రొడక్షన్స్ కి ఒక భారీ సక్సస్ దక్కబోతుందని చెప్పుకుంటున్నారు. 

 

అయితే ఈ సినిమా కూడా నారప్ప మాదిరిగానే సగానికి పైగానే చిత్రీకరణ జరగాల్సి ఉంది. అది కంప్లీట్ చేసి 2020 లోనే రెండు సినిమాలని రిలీజ్ చేయాలనుకున్న సురేష్ బాబు ఇప్పుడు తొందరపడ దలచుకోలేదట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాలని కంప్లీట్ చేయడం రిలీజ్ చేయడం లాంటి నిర్నయాలకి బ్రేక్ వేశారు. 2021 వరకు ఈ సినిమాల రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. అంతేకాదు తన నిర్నాణంలో కొన్ని సినిమాలని తాత్కాలికంగా ఆపేశారు కూడా. ఆ సినిమాల లిస్ట్ లో 120 కోట్ల భారీ బడ్జెట్ సినిమా హిరణ్య కశిప కూడా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: