సూపర్ స్టార్ మహేష్ బాబుకి కోపం వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మహేష్ 27వ సినిమాగా పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాను రెండు పెద్ద బ్యానార్ లు నిర్మిస్తున్నాయి. సినిమా టైటిల్ ఎనౌన్స్ రోజే అంచాలు పెంచాడు డైరక్టర్ పరశురాం. అయితే ఊహించని విధంగా మహేష్ ఎస్.వి.పి నుండి లీకులు మొదలయ్యాయి. సినిమా స్టోరీ లైన్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాలో బ్యాంక్ సెట్ వేస్తున్నారన్న వార్త కూడా బయటకు వచ్చింది.

 

ఈ విషయం మహేష్ దాకా వెళ్లడంతో చాలా అప్సెట్ అయ్యాడట. పరశురాం కు స్టోరీ బ్యాక్ డ్రాప్ మార్చమని చెప్పినట్టు తెలుస్తుంది. పరశురాం కూడా సేఫ్ సైడ్ కు మరో బ్యాక్ డ్రాప్ అనుకోగా దాన్ని మహేష్ కు చెప్పి ఒప్పించాలని చూస్తున్నాడు. మొత్తానికి మహేష్ బాబు పరశురాం సినిమా లీకుల బారీన పడి సినిమా అసలకే ఎసరు పెట్టేలా ఉంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల హ్యాట్రిక్ హిట్ తో మహేష్ తన సత్తా చాటారు. గీతా గోవిందం తర్వాత రెండేళ్ల గ్యాప్ ఇచ్చి మరి సూపర్ స్టార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు పరశురాం.

 

ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే మహేష్ ఫ్యాన్స్ కూడా ఎక్సయిటింగ్ ఫీల్ అయ్యారు. సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం రికార్డులు సృష్టించినట్టే. తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా తన వంతుగా కృషి చేస్తా అంటున్నాడు పరశురాం. కథ, కథనాలే కాదు తన సినిమాల్లో డైలాగ్స్ కూడా బాగా రాస్తూ మరో త్రివిక్రం అనిపించుకుంటున్న పరశురాం మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: