సెప్టెంబర్ 23, 2011 వ సంవత్సరంలో విడుదల అయిన దూకుడు సినిమాలో మహేష్ బాబు సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కి తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పినట్టు నటించగల ఏకైక హీరోగా మహేష్ బాబు పేరు తెచ్చుకొని అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు. ఈ చిత్రంలో తన  హీరోయిజాన్ని కాసేపు పక్కన పెట్టి బ్రహ్మానందానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు మహేష్ బాబు. శ్రీను వైట్ల చెప్పినట్టు అద్భుతమైన కామెడీ పండించిన మహేష్ బాబు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. 


ఏం.ఎస్ నారాయణ, బ్రహ్మానందం లతో తాను ఉన్నప్పుడు పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు మహేష్ బాబు. అలాగే విలన్ ని ఎదుర్కొనే సన్నివేశాల్లో మహేష్ బాబు తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ప్రేక్షకులను వెండితెరకు కట్టి పడేసాడు. పోలీస్ పాత్రలో నటించిన ఇతను పోలీస్ అని చెప్పే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా... భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది... కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.... నేను నరకటం మొదలుపెడితే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి రా... వంటి డైలాగులు దూకుడు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. 


గోల్డ్ మెడల్ పొందిన ఐపీఎస్ ఆఫీసర్ గా మహేష్ బాబు ఈ చిత్రంలో జీవించేశాడని చెప్పుకోవచ్చు. మహేష్ సరసన నటించిన సమంత కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. టర్కీ దేశంలో సమంతాకి మహేష్ బాబు కి మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలు వెండితెరపై మ్యాజిక్ సృష్టించాయని చెప్పుకోవచ్చు. రొమాంటిక్ పరంగా యాక్షన్ పరంగా దూకుడు సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులని బాగా మెప్పించాయి. ఏదేమైనా ఈ సినిమా మొత్తంలో మహేష్ బాబు నవ్వుతూనే కనిపిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: