వరుణ్ తేజ్ కోసం ముగ్గురు దర్శకులు పనిచేస్తున్నారు. ఒకరు స్టోరీ లైన్ ఇస్తే.. మరొకరు ఆ స్టోరీని డెవలెప్ చేస్తున్నారు. వీళ్లిద్దరు ఇచ్చిన కథను మరొకరు డైరెక్ట్ చేయబోతున్నారు. ఇంతకీ ముగ్గురు దర్శకులు కలిసి వరుణ్ తేజ్ తో ఎలాంటి సినిమాలు తీయబోతున్నారో తెలుసా. ముగ్గురు డైరెక్టర్లు కలిసి పనిచేసేంత స్పెషాలిటీ ఆ సినిమా ఏముందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుంచి సమ్ థింగ్ స్పెషల్ గా ఉండే స్క్రిప్ట్ నే సెలక్ట్ చేసుకుంటున్నాడు. యూనిక్ స్టోరీస్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు క్రిష్ కూడా వరుణ్ కోసం ఇలాగే యూనిక్ లైన్ ను రెడీ చేశాడట. కానీ ఈ క్రిష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయడం లేదు. సురేందర్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. 

 

వరుణ్ తేజ్ కోసం క్రిష్ లైన్ రెడీ చేస్తే.. వక్కంతం వంశీ ఈ స్టోరీని డెవలెప్ చేస్తున్నాడట. సురేందర్ రెడ్డితో కలిసి వంశీ కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాడని సమాచారం. ఇక ఇద్దరు దర్శకుల సహకారంతో పూర్తయిన ఈ కథను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడట. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది.

 

ముగ్గురు దర్శకులు క్రిష్, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి ప్రిపేర్ చేస్తోన్న ఈ స్టోరీ ఎలా ఉంటుంది.. వరుణ్ తేజ్ ని ఎలా చూపిస్తారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే వరుణ్ షూటింగ్ లకు పర్మీషన్ రాగానే గీతా ఆర్ట్స్ వారి బాక్సింగ్ డ్రామాలో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి-వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ సెట్స్ కి వెల్లే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: