నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 106 సినిమా కాగా... ఈ సినిమాతో ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమాని త్వరలో మళ్ళీ మొదలు పెట్టబోతున్నారట.  "మోనార్క్" అన్న టైటిల్ ని బోయపాటి బృందం పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

 

అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ గా శ్రియ శరణ్, అంజలి, ప్రియమణి లలో ఇద్దరిని ఫైనల్ చేస్తారట. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఇప్పటి నుంచి బాలయ్య నటించే సినిమాలకి యంగ్ డైరెక్టర్స్ నే ఎంచుకోవాలని చూస్తున్నారట. అంతేకాదు కథ కూడా కొత్తగా ఉండాలని తనకి బాగా కనెక్ట్ అయి ఉన్న దర్శకులకి ముందుగానే చెప్పారట. కథ కొత్తగా లేకపోతే మాత్రం నా దగ్గరికి రావద్దని కూడా నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలుస్తుంది. 

 

దీంతో ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఒక వార్త బాగా చర్చలలో ఉంది. అదే బాలయ్య, ప్రముఖ సీనియర్ అండ్ జీనియస్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు గురించి. ఈ ఇద్దరి కలయికలో ఆదిత్య 369 వచ్చి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలని బాలయ్య సింగీతం అనుకున్నారు. కాని ఏళ్ళ తరబడి వాయిదా పడుతూనే ఉంది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 రూపొందనుందని ప్రచారం మొదలైంది.అయితే బాలయ్య తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ కాంబినేషన్ లో సినిమా ఉండబోదని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయంలో బాలయ్య గాని సింగీతం శ్రీనివాస రావు వెల్లడిస్తే అసలు విషయం తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: