సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయో లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మహేష్ కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కుతుండగా జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా లో మహేష్ బాబు ఆర్ధిక నేరస్థుడిగా నటించబోతున్నాడట. ఇందుకోసం భారీ బ్యాంక్ సెట్ ని నిర్మిస్తున్నారు. ఆగస్టు రెండవ వారం నుంచి ఆ బ్యాంక్ సెట్ లో చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారట.

 

IHG'సర్కారు వారి పాట'లో <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH' target='_blank' title='మహేష్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్</a> ...

ఇక ఈ సినిమాలో ముందునుంచి కీర్తి సురేష్ ని తీసుకోవాలని టీం అనుకుంటున్నారు. దాదాపు తననే ఫైనల్ చేశారంటూ త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. కాని ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. అలాగే కీర్తి కాకపోతే సాయి మంజ్రేకర్ ఫైనల్ అని అనుకుంటున్నారు. ఇక మరో హీరోయిన్ కి అవకాశం ఉండగా ఆ హీరోయిన్ సాయి పల్లవి లేదా నివేదా థామస్ అని అంటున్నారు. అంతేకాదు ఒకవేళ కీర్తి సురేష్ ని చిత్ర బృందం ఫస్ట్ హీరోయిన్ అనుకుంటే సెకండ్ హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. 

 

IHG

అయితే సాయి మంజ్రేకర్ పేరు పరిశీలనలో ఉండగానే మహేష్ కంటే ముందే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలో కన్‌ఫర్మ్ అయిందట. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ పేరు పరిశీలించినప్పటికి సాయి మంజ్రేకర్ ని ఫైనల్ చేశారట. అదే గనక నిజమైతే మహేష్ సర్కారు వారి పాట రెండవ సినిమా అవుతుంది. అందరూ అనుకున్నట్టు మహేష్ కాకుండా సాయి మంజ్రేకర్ ముందు వరుణ్ సినిమా లాంచింగ్ బెటరనుకుందేమో. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తుండగా బాక్సర్ అన్న టైటిల్ ని అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: