మలయాళంలో 'ప్రేమమ్'  సినిమాతో తెలుగులో రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది సాయి పల్లవి. అటువంటి సాయి పల్లవి... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు మంచి క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పడింది. ఆ సినిమాలో భానుమతి పాత్ర లో సాయి పల్లవి చెప్పిన డైలాగులు సినిమాకే హైలెట్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. పక్కా మాస్ పల్లెటూరి అమ్మాయి గా, మొండి అమ్మాయిగా సాయి పల్లవి నటించిన నటనన్ను తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆస్వాదించారు. ఆ తర్వాత నానితో 'ఎంసీఏ' సినిమాతో కూడా మంచి విజయం సాధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో సాయి పల్లవి కుర్ర హీరోలతో ‘కణం’, ‘ఎన్జీకె’, ‘పడి పడి లేచె మనసు’ నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కాస్త స్పీడ్ మొన్నటి వరకు తగ్గింది.

 

ఇదిలా ఉండగా కెరియర్ లో మహేష్ బాబు మరియు విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో సినిమా ఛాన్సులు చేసే అవకాశం వచ్చినా సినిమాలో క్యారెక్టర్ విషయంలో...తనకు నచ్చకపోవటం తో ఆ సినిమాలను పక్కన పెట్టేసింది. కేవలం మంచి పాత్రలు చేయాలన్నదే తన ఉద్దేశమని తెలిపింది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోయిన్ గా నటిస్తూ అదిరిపోయే అవకాశాలు అందుకుంటోంది.

 

ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి...యాంకర్ తనని మలయాళీ  అని పిలవడంతో అసలు ఆ పేరు నాకు నచ్చదు, అలా పిలవద్దు అని యాంకర్ పై సీరియస్ అయింది. ‘నేను తమిళమ్మాయిని.. నేను కోయంబత్తూర్ లోనే పెరిగాను. అసలు సిసలు తమిళమ్మాయిని నేను. నన్ను మలయాళీ అని మాత్రం పిలవకండి’ అంటూ ఘాటుగా సమాధానం ఇంటర్వ్యూలో ఇచ్చిందట సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: