ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ ల విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్ లు కూడా ముంబై లో ఒకరు అమెరికాలో ఒకరు ఉండిపోయారు. ఇక అక్కడి నుంచి వారిని ఏ విధంగా తీసుకుని రావాలి అనేది దర్శకుడు రాజమౌళి కి నిర్మాత దానయ్య కు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా  పెద్దగా ఫలించే అవకాశాలు కనపడటం లేదు అనే చెప్పాలి. సినిమా వచ్చే ఏడాది మే లో ఏ విధంగా అయినా సరే విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారు. 

 

అయినా సరే అది హీరోయిన్ ల కారణంగా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్. ఇప్పుడు జక్కన్న వారి కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అవి అంతగా ఫలించడం లేదు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. నిజం ఎంత అనేది తెలియదు గాని తారక్ ఇప్పుడు హీరోయిన్ లను మార్చాలి అనే సూచన చేసినట్టు తెలుస్తుంది. తాను చాలా వరకు ఎదురు చూస్తున్నా అని ఇప్పటికే రెండు ఏళ్ళు అయింది అని ఇంకా లేట్ అయితే ఇబ్బంది వస్తుంది అని చెప్పినట్టు సమాచారం. 

 

ఇక త్రివిక్రమ్ కూడా తారక్ తో సినిమా చేయడానికి గానూ ఎదురు చూసే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. ఆయన మరో సినిమా ఉన్నా సరే ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఇక ఇప్పుడు హీరోయిన్ లు ఇద్దరినీ కూడా మార్చేయడమే మంచిది అనే ఆలోచనలో ఉన్నాడట. వాళ్ళ షూటింగ్ కూడా పెద్దగా కాలేదు అని కాబట్టి తారక్ పాత్ర కోసం కీర్తి సురేష్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: