కరోనా దెబ్బకు దర్శక నిర్మాతలకు స్టార్ హీరోలకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. స్వేచ్చగా సినిమాలు చేసే పరిస్థితి ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గుతున్నారు. నిర్మాతల పరిస్థితి తెలిసి వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉందని తెలుస్తుంది. ఇక అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో వచ్చే పరిస్థితి అయితే లేదు. 

 

ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే టాలీవుడ్ లో... ఒక వార్త హల్చల్ చేస్తుంది. సర్కారు వారి పాట సినిమాకు మహేష్ బడ్జెట్ తగ్గించాడు అని ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన సినిమా కోసం భారీగా బడ్జెట్ తగ్గించారు అని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ అని భావించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సహా... హారిక అండ్ హాసిని బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా బడ్జెట్ ని ఇప్పుడు దాదాపు 30 శాతం తగ్గించారు అని సమాచారం. 

 

దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. త్రివిక్రమ్ కి ఇచ్చే పారితోషికం కూడా తగ్గించే సూచనలే దాదాపుగా ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇతర నటుల పారితోషికం కూడా తగ్గించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: