చిరంజీవి సినిమాలకు ఆదరణ ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఒక రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సినిమా గురించి ఏ ప్రకటన వచ్చినా సరే జనాలకు ముందు నుంచి కూడా అదో తెలియని ఆసక్తి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే చాలా మంది థియేటర్ కి పరుగులు తీస్తూ ఏ విధంగా అయినా సరే సినిమాను మొదటి రోజే చూడాలి అనే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు చిరంజీవి 70 ఏళ్ళు వస్తున్నా సరే సినిమాల విషయంలో మాత్రం అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. 

 

ఆయన ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 40 శాతం వరకు సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన షూటింగ్ ని కూడా త్వరలోనే పూర్తి చేయవచ్చు. ఇక కరోనా కారణంగా చిరంజీవి వయసు పెద్దది కాబట్టి ఆయన ముందుకు రావడం లేదు షూటింగ్ కి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

ఆయన ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనపడే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. అవును ఫ్లాష్‌బ్యాక్‌లో దేవాదాయశాఖలో ప‌నిచేసే ఉన్న‌త అధికారిగా, మిగిలిన సినిమాలో న‌క్స‌లైట్ పాత్ర‌లో  నటిస్తారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ లేదా మహేష్ బాబు నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఎలా అయినా సరే విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని పట్టుదలగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: